ఇది సామాన్యుడికి అండగా నిలిచే బడ్జెట్

సంక్షేమానికి పట్టం కట్టామన్నమోడి

YouTube video
PM Narendra Modi’s remarks on Union Budget 2021-22

న్యూఢిల్లీ: నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ప్రధాని నరేంద్రమోడి ప్రత్యేక వీడియో సందేశాన్ని ట్విటర్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని స్పందిస్తూ..అన్ని వర్గాల వారిని సంతృప్తిపరిచే విధంగా బడ్జెట్ ఉందని కితాబిచ్చారు. సంక్షేమానికి పట్టం కట్టిన బడ్జెట్ అని పేర్కొన్నారు. మౌలిక వసతులకు ఇందులో పెద్దపీట వేశామని చెప్పారు. పారదర్శకతతో కూడిన బడ్జెట్ ప్రవేశపెట్టామని, దేశాన్ని సర్వతోముఖాభివృద్ధి బాటలో నడిపిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ తో తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి తీరప్రాంత రాష్ట్రాలు శక్తి కేంద్రాలుగా మారతాయని అన్నారు.

అన్నింటికి మించి ఇది సామాన్యుడికి అండగా నిలిచే బడ్జెట్ అని స్పష్టం చేశారు. అభివృద్ధి పాటే ఉద్యోగ కల్పనకు చేయూతనిస్తుందని వివరించారు. ఈ బడ్జెట్ హృదయంలో రైతులు, గ్రామీణప్రాంతాలే ఉన్నట్టు మోదీ తెలిపారు. వ్యవసాయ మార్కెట్ల బలోపేతానికి చర్యలు తీసుకున్నామని, ఆరోగ్యరంగం బలోపేతం దిశగా బడ్జెట్ లో నిధులు కేటాయించామని వెల్లడించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/