నూతన పార్లమెంట్‌ భవనానికి ప్రధాని భూమి పూజ

వేదమంత్రోచ్చారణ మధ్య భూమి పూజ కార్యక్రమం

YouTube video
PM Shri Narendra Modi lays the foundation stone for new Parliament building in New Delhi.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఢిల్లీలోని సంసద్ మార్గ్ లో నూతన పార్లమెంటు భవన సముదాయానికి భూమిపూజను నిర్వహించారు. వేద పండితులు వేదమంత్రోచ్చారణ చేస్తుండగా ఆయన భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లతో పాలు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. త్రిభుజాకారంలో నిర్మించనున్న ఈ భవనంలో ఐదు ఫ్లోర్లు ఉంటాయి. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూ. 971కోట్ల వ్యయంతో భవనాన్ని నిర్మిస్తున్నారు. లోక్ సభకు ఆనుకుని ప్రధాని కార్యాలయం ఉంటుంది. 2022 ఆగస్టు నాటికి ఈ భవనం పూర్తి కానుంది. వందేళ్ల అవసరాలకు సరిపడేలా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/