పంజాబ్లోని జలంధర్లో బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని
జలంధర్: పంజాబ్లోని జలంధర్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఫెడరలిజాన్ని తాము గౌరవిస్తున్నామని ప్రధాని అన్నారు. సమాఖ్య వ్యవస్థలో భాగంగానే మాజీ సీఎం అమరీందర్ సింగ్ తమ ప్రభుత్వంతో కలిసి పనిచేసినట్లు ప్రధాని తెలిపారు. పంజాబ్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. నవ పంజాబ్ రుణ విముక్తి అవుతుందన్నారు. అయితే ప్రస్తుత పంజాబ్ ప్రభుత్వం తనకు భద్రత కల్పించడంలో విఫలమైనట్లు ఆయన ఆరోపించారు. త్రిపురమాలిని దేవి శక్తిపీఠానికి వెళ్లాలని అనుకున్నానని, కానీ ప్రభుత్వం, పోలీసులు భద్రత కల్పించలేకపోయినట్లు ఆయన తెలిపారు. అయితే త్వరలోనే ఆ శక్తిపీఠం వద్ద పూజలు చేయనున్నట్లు మోడీ తెలిపారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/