ఎంపీల బహుళ అంతస్తుల ఫ్లాట్లను ప్రారంభించిన ప్రధాని
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఎంపీల కోసం నిర్మించిన బహుళ అంతస్తుల నివాస భవనాలను సోమవారం వర్ట్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. ఈ ఫ్లాట్ లను న్యూ ఢిల్లీ లోని డాక్టర్. బి.డి.మార్గ్ లో కట్టారు. 80 ఏండ్లు పైబడిన ఎనిమిది పాత బంగళాలకు చెందిన భూమిలో ఈ 76 ఫ్లాట్ లను నిర్మించారు. ‘ఎంపీ ల గృహ వసతి చాలా కాలంగా పరిష్కారం కాకుండా అలాగేఉంది . దానిని ఇప్పుడు పరిష్కరించడం జరిగిందని ‘ ప్రధాని మోడి చెప్పారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/