అయోధ్య చేరుకున్న ప్రధాని మోడి

హనుమాన్‌గఢీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు

YouTube video
PM Narendra Modi attends Bhoomi Pujan ceremony of Shri Ram Janmabhoomi in Ayodhya

అయోధ్య: ప్రధాని నరేంద్రమోడి అయోధ్య చేరుకున్నారు. లక్నో విమానాశ్రయం నుంచి ప్రత్యేక సైనిక హెలికాప్టర్‌లో అయోధ్య చేరుకున్న ఆయనకు కోవిడ్‌ ప్రొటోకాల్‌ ప్రకారం ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్‌, ఉన్నత అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. హెలిప్యాడ్‌ నుండి ప్రధాని నేరుగా హనుమాన్‌గఢీకీ చేరుకున్నారు. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం భూమిపూజ జరిగే ప్రదేశానికి ప్రధాని మోడి చేరుకుంటారు. కాగా ప్రధాని రోజువారీ వస్త్రధారణకు భిన్నంగా పంచకట్టులో కనిపించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/