దేశ అభివృద్ధిలో ప్ర‌తి భాగ‌స్వామి పాలుపంచుకోవాలి..ప్రధాని

YouTube video
PM Narendra Modi addresses webinar on Production Linked Incentives scheme.

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ప్రొడ‌క్ష‌న్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ప‌థ‌కంపై వెబినార్‌లో పాల్గొన్నారు. ఈసందర్బంగా ప్రధాని మాట్లడుతూ..కేంద్ర బ‌డ్జెట్ ప్ర‌ణాళిక‌, దేశానికి సంబంధించిన విధాన రూప‌క‌ల్ప‌న కేవ‌లం ప్ర‌భుత్వ ప్ర‌క్రియ‌కే ప‌రిమితం కావ‌ద్ద‌ని వ్యాఖ్యానించారు. దేశ అభివృద్ధిలో ప్ర‌తి భాగ‌స్వామి పాలుపంచుకోవాల‌ని, చురుకైన పాత్ర పోషించాల‌ని ప్ర‌ధాని సూచించారు. దేశంలో త‌యారీరంగాన్ని ఉర‌క‌లెత్తించ‌డానికి మ‌నం భారీ చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు. మ‌న దేశ కంపెనీలు ప్ర‌పంచ‌స్థాయి కంపెనీల‌తో పోటీప‌డేలా చేయ‌డం కోసం అహ‌ర్నిశ‌లు కృషిచేయాల్సిన అస‌వ‌రం ఉంద‌న్నారు.

తాజా తెలంగాణ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/