నేవీ జెండాలో కొత్త గుర్తు..ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను చూసి ప్రతి భారతీయుడు గర్వించాలి:ప్రధాని

YouTube video
PM Modi’s speech at commissioning of INS Vikrant

తిరువనంతపురంః కొచ్చిలోని కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో తొలి బాహుబలి నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దీంతో పాటు ఇండియ‌న్ నేవీ నేడు కొత్త జెండాను ఆవిష్క‌రించింది. ప్ర‌ధాని చేతుల మీదు ఆ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఐఎన్ఎస్ విక్రాంత్ జ‌ల‌ప్ర‌వేశం సంద‌ర్భంగా నేవీ కొత్త జెండాను ప్ర‌జెంట్ చేశారు. ఆ జెండాలో ఓ కొత్త గుర్తును జోడించారు. మ‌రాఠా యోధుడు ఛ‌త్ర‌ప‌తి శివాజీ ఇన్‌స్పిరేష‌న్‌తో రుపుదిద్దుకున్న ఓ గుర్తును ఆ జెండాలో డిజైన్ చేశారు. ఈ సందర్భంగా మోడి మాట్లాడుతూ..కేరళ తీరంలో నవశకం ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అమృతోత్సవ వేళ ఐఎన్‌ఎస్‌ నౌక ప్రవేశం శుభపరిణామం అని పేర్కొన్నారు. భారత్‌కు సాధ్యం కానిది ఏదీ ఉండదని, ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ నౌకను చూసి ప్రతి భారతీయుడు గర్వించాలని అన్నారు.

కాగా, శివాజీకి నౌకాద‌ళం ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న ప్రేర‌ణ‌తో ఆ జెండాలో గుర్తును క‌లిపారు. బ్లూ క‌ల‌ర్ ఆక్టోగోన‌ల్ ఆకారంలో ఉన్న గుర్తును నేవీ జెండాలో డిజైన్ చేశారు. అష్టాకారంలో ఉన్న గుర్తులో రెండు గోల్డ్ క‌ల‌ర్ బోర్డ‌ర్లు ఉన్నాయి. శివాజీ నేవీ ముద్ర‌ను పోలిన‌ట్లు ఈ కొత్త డిజైన్‌ను రూపొందించారు. శివాజీ ద‌ళంలో సుమారు 60 యుద్ధ నౌక‌లు ఉండేవి. అత‌ని వ‌ద్ద 5000 మంది నావికులు ఉండేవారు. శివాజీ పాల‌న స‌మ‌యంలో మ‌రాఠా నౌకాద‌ళం శ‌క్తివంతంగా ఉండేది. తీర ప్రాంతాన్ని ఆ ద‌ళం నిత్యం ర‌క్షిస్తూ ఉండేది. అష్టాకారం అంటే ఎనిమిది దిక్కులు అని, అన్ని దిక్కుల్లోనూ నౌకాద‌ళం అబేధ్యంగా ఉన్న‌ట్లు గుర్తుండే రీతిలో ఆ ముద్ర‌ను డిజైన్ చేసిన‌ట్లు నేవీ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

ఈనౌక పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. దాదాపు ఏడాదిగా సముద్రంలో ట్రయల్ రన్ పూర్తి చేసుకున్న INS విక్రాంత్ నౌకాదళంలో చేరింది. బాహుబలి యుద్ధనౌకగా పేరుగాంచిన….ఐఎన్ఎస్-విక్రాంత్ రాకతో హిందూ మహాసముద్ర జలాల్లో భారత తీర ప్రాంతంలో మరింత బందోబస్తు పెరగనుంది. ఇప్పటిదాకా భారత్‌ వద్ద ఉన్న యుద్ధ నౌకలన్నీ బ్రిటన్, రష్యాల నుంచి దిగుమతి చేసుకున్నవే. అలాంటిది అగ్రదేశాలకు దీటుగా అత్యాధునిక విమాన వాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌ విజయవంతంగా నిర్మించింది.

ఈ సామర్థ్యమున్న అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్‌ సరసన భారత్ సగర్వంగా తలెత్తుకుని నిలిచింది. చైనాతో ఉద్రిక్తత నెలకొన్న వేళ ఆత్మనిర్భర్‌ భారత్‌కు ఊతమిస్తూ నిర్మించిన ఈ బాహుబలి యుద్ధనౌకను ప్రధాని నరేంద్ర మోడీ  జాతికి అంకితం చేశారు. ఇది 2023లో తూర్పు నౌకాదళ అమ్ములపొదిలో పూర్తిస్థాయిలో చేరే అవకాశముంది. బాహుబలి యుద్ధనౌకగా పేరుగాంచిన…. ఐఎన్ఎస్-విక్రాంత్ రాకతో హిందూ మహాసముద్ర జలాల్లో భారత తీర ప్రాంతంలో మరింత బందోబస్తు పెరగనుంది.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/specials/career/