వ్యాక్సిన్ వేయించుకున్న ప్ర‌ధాని త‌ల్లి హీరాబెన్‌

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ త‌ల్లి హీరాబెన్ మోడీ గురువారం కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విష‌యాన్ని ట్విట‌ర్ ద్వారా మోడీ నే వెల్ల‌డించారు. మా అమ్మ ఇవాళ కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న‌ద‌ని చెప్ప‌డానికి చాలా సంతోషిస్తున్నాను. మీ చుట్టుప‌క్క‌ల వ్యాక్సినేష‌న్‌కు అర్హ‌త క‌లిగిన వారిని ప్రోత్స‌హించాల్సిందిగా నేను కోరుతున్నాను అని మోడీ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్ర‌ధాని మోడీ కూడా ఈ నెల 1న కొవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న హైద‌రాబాద్ సంస్థ భార‌త్ బ‌యోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా వేసుకున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/