ప్రజల్లో 70 శాతం మందికి మోడీ పై ఆదరణ

ప్రపంచంలోని 13 మంది నేతల్లో మోడీ నంబ‌ర్ 1

అమెరికా సంస్థ‌ ‘మార్నింగ్‌ కన్సల్ట్‌’ వెల్ల‌డి

pm modi

న్యూఢిల్లీ : ప్రపంచంలోని 13 మంది నేతల్లో అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకు ప్ర‌ధాని మోడీయేన‌ని అమెరికా సంస్థ‌ ‘మార్నింగ్‌ కన్సల్ట్‌’ తాజాగా వెల్ల‌డించిన ఓ స‌ర్వే గణాంకాల ద్వారా స్పష్టం చేసింది. ప్రజల్లో 70 శాంతి మంది ఆయ‌న‌పై ఆదరణ క‌న‌బ‌ర్చారు. అలాగే, సర్వేలో పాల్గొన్న వయోజనుల్లో 25 శాతం మంది మాత్రమే ఆయన పట్ల వ్యతిరేకత కనబ‌రిచారు. వారానికి ఒక‌సారి ఈ గణాంకాలను అప్ డేట్ చేస్తుంటారు. ఈ జాబితాలో రెండో స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్‌ మేన్యుయెల్‌ లోపెజ్‌ ఓబ్రడార్‌, ఇటలీ ప్రధాని మారియో డ్రాఘి ఉన్నారు.

అంత‌కు ముందు ‘మార్నింగ్‌ కన్సల్ట్‌’ వెల్ల‌డించిన ఫ‌లితాల్లోనూ ప్రజామోదంలో మోడీయే అగ్ర‌స్థానంలో నిలిచారు. 2019 ఆగస్టులో మోడీ ప్ర‌జాద‌ర‌ణ 82 శాతంగా ఉండేది. జూన్‌లో మోడీ ప్రజాదరణ 66 శాతానికి తగ్గగా, ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న త‌న అగ్ర‌స్థానాన్ని ప‌దిలంగా ఉంచుకుంటూనే 70 శాతానికి దాన్ని మెరుగుప‌ర్చుకున్నారు. ఇక‌ అత్య‌ధిక మంది తిర‌స్క‌రిస్తోన్న ప్ర‌ధానిగా జపాన్‌ ప్రధాని సుగా నిలిచారు. ఆయ‌న‌ను 64 శాతం మంది వ్యతిరేకిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/