ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రధాని మోడీ ప్రసంగం

ఇవాళ ప్రధాని హోదాలో ఐరాసలో ప్రసంగిస్తున్నానన్నమోడీ

YouTube video
PM Modi’s address to the United Nations General Assembly

న్యూయార్క్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో భాగంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. ఆయన ప్రసంగం హిందీలో కొనసాగింది. ఈ కార్యక్రమానికి భారత విదేశాంగ మంత్రి జై శంకర్, దౌత్యాధికారులు కూడా హాజరయ్యారు. భారత్ లో వేల సంవత్సరాలుగా ప్రజాస్వామ్య పరంపర కొనసాగుతోందని మోదీ వెల్లడించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయిందని, దేశంలోని వైవిధ్యమే ప్రజాస్వామ్యాన్ని బలంగా మార్చిందని తెలిపారు. ప్రజాస్వామ్య వికాసానికి భారత్ ఒక ఉదాహరణ అని అన్నారు. బాల్యంలో రైల్వే స్టేషన్లో టీ అమ్మిన వ్యక్తి, ఇవాళ ఓ దేశానికి ప్రధాని హోదాలో ఐక్యరాజ్యసమితిలో ప్రసంగిస్తున్నాడని, ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమేనని ఉద్ఘాటించారు. ప్రజాస్వామ్య మాతగా వెలుగొందుతున్న భారత్ కు తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని వెల్లడించారు. సమాజంలో ప్రతి వ్యక్తి సంతోషంగా ఉండాలనేదే భారతీయ తత్వం అని పేర్కొన్నారు.

వందేళ్లలో ఎన్నడూ చూడనంత విపత్తును కరోనా తీసుకువచ్చిందని, అయితే కరోనా సంక్షోభ సమయంలోనూ తాము దేశంలో 3 కోట్ల ఇళ్లు కట్టించి ఇచ్చామని వెల్లడించారు. కరోనా వేళ డీఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసి ప్రపంచానికి అందించామని, ఎం ఆర్ఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్, ముక్కులో వేసే వ్యాక్సిన్ కూడా వస్తున్నాయని వెల్లడించారు. కరోనా సమయంలో తాము తీసుకువచ్చిన కొవిన్ యాప్ అద్భుతంగా పనిచేసిందని చెప్పారు. భారత్ అనేక డిజిటల్ సంస్కరణలు తీసుకువచ్చిందని, భారత్ తెచ్చిన సంస్కరణలు ప్రపంచ గతినే మార్చుతాయన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు. భారతదేశ అభివృద్ధి ప్రపంచానికి చోదకశక్తిగా మారుతోందని ప్రధాని మోడీ వివరించారు. అందుకు సైన్స్, టెక్నాలజీ తోడ్పాటు అందిస్తున్నాయని తెలిపారు. దేశంలోని 6 లక్షల గ్రామాలను డ్రోన్ మ్యాపింగ్ చేసినట్టు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి వివరించారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/