ఏపీ, తెలంగాణ, కర్నాటక బీజేపీ ఎంపీలతో ప్రధాని భేటీ

భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం!

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో బుధవారం ఉదయం సమావేశమయ్యారు. ప్రధాని నివాసంలో బీజేపీ ఎంపీలకు మోడీ అల్పాహార విందును ఏర్పాటు చేశారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని తాజా రాజకీయ పరిస్థితులపై ఎంపీలతో మోడీ పిచ్చాపాటి నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఆనవాయితీగా వస్తున్న వివిధ రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో మోడీ సమావేశమయ్యారు. రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం, కేంద్ర పధకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం అంశాలపై ఎంపీలకు ప్రధాని దిశానిర్దేశం చేయనున్నారు. మోడీతో సమావేశానికి తెలంగాణ నుంచి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు హాజరవగా… ఏపీ నుంచి బీజేపీ ఎంపీలు జీవీఎల్, సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్ సమావేశంలో పాల్గొన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/