డాక్ట‌ర్ శ్యామా ప్ర‌సాద్ ముఖ‌ర్జీకి ప్రధాని నివాళి

న్యూఢిల్లీ: నేడు జనసంఘ్‌ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వ‌ర్థంతి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ తో సహా పలువురు మంత్రులు, భారతీయ జనతా పార్టీ నేత‌లు ముఖ‌ర్జీకి నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మాట్లాడుతూ.. ఈ దేశానికి ముఖ‌ర్జీ చేసిన సేవ‌లు మ‌రువ‌లేనివ‌న్నారు. ఆయన ఆదర్శాలు, గొప్ప ఆలోచనలు, ప్రజలకు సేవ చేయాలనే నిబద్ధత మనకు నిరంత‌రం స్ఫూర్తినిస్తూనే ఉంటాయ‌న్నారు. జాతీయ సమైక్యత కోసం ఆయన చేసిన ప్రయత్నాలను ఎప్పటికీ మరచిపోలేమ‌ని పేర్కొన్నారు. కాగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వ‌ర్థంతి సందర్భంగా హౌజ్ ఖాస్‌లో ఒక మొక్క‌ను నాటారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/