ప్ర‌ధాని అధ్య‌క్ష‌త‌న ఆదివారం అఖిల ప‌క్ష స‌మావేశం!

న్యూఢిల్లీ: ఈ నెల 28 న ( ఈ ఆదివారం) ప్ర‌ధాని మోడీ అధ్య‌క్ష‌త‌న అఖిల ప‌క్ష స‌మావేశం జ‌ర‌గ‌నున్న‌ది. పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాల‌ నేప‌థ్యంలో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వ‌హించ‌నున్నారు. అన్ని పార్టీల‌కు చెందిన ప్ర‌తినిధుల‌ను ఆ భేటీకి ఆహ్వానిస్తున్నారు. పార్ల‌మెంట్ స‌మావేశాలు స‌జావుగా నిర్వ‌హించేందుకు తీసుకోవాల్సిన అంశాల‌పై మోడీ విప‌క్షాల‌తో చ‌ర్చించే అవ‌కాశాలు ఉన్నాయి. వ‌చ్చే సోమ‌వారం నుంచి శీతాకాల స‌మావేశాలు ప్రారంభంకానున్న విష‌యం తెలిసిందే.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/