నేడు ముఖ్యమంత్రులతో మోడీ కీలక సమావేశం

మహమ్మారి కట్టడిపై సీఎంలతో సమీక్ష నిర్వహించనున్న మోడీ

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు మళ్లీ ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధాని మోడి ఈరోజు కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. వర్చువల్ గా జరగనున్న ఈ సమావేశం కాసేపట్లో ప్రారంభం కాబోతోంది.

మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, మహమ్మారి కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎంలతో మోడీ సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రుల నుంచి సలహాల స్వీకరిస్తూనే, రాష్ట్రాలకు కీలక సూచనలు చేయనున్నారు. దీంతోపాటు, దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ పై కూడా చర్చించనున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/