బెంగాల్ ప్రజలను అన్ని విధాల ఆదుకుంటాం

బెంగాల్ ను అతలాకుతలం చేసిన అంఫాన్‌ తుపాన్‌

PM MODI
PM MODI

న్యూఢిల్లీ: అంఫాన్‌ తుపాన్‌ ధాటికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం చిగురుటాకులా వణికిపోయింది. బెంగాల్ లోని పలు ప్రాంతాలు తుపాను విధ్వంసాగా మారాయి. ఈ సంఘన పై ప్రధాని మోడి స్పందించారు. పశ్చిమ బెంగాల్ లో అంఫాన్ తుపాను బీభత్సం తాలూకు దృశ్యాలను చూస్తున్నామని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో యావత్ భారతదేశం పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంఘీభావం ప్రకటిస్తోందని తెలిపారు. బెంగాల్ ప్రజలు వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామని, బెంగాల్ లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయని, ఉన్నతాధికారులు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో నిరంతరం సమన్వయంతో వ్యవహరిస్తూ పరిస్థితులను సమీక్షిస్తున్నారని మోడి వెల్లడించారు. తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లోని ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రధాని స్పష్టం చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/