ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చి ఆదుకోండి

ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన ప్రధాని మోడీ మాట నిలబెట్టుకోవాలి

mekathoti sucharitha
mekathoti sucharitha

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన ప్రధాని నరేంద్రమోడీ మాట నిలబెట్టుకోవాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. కృష్ణా జిల్లా నందిగామలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు అవసరమైన నిధులు ఇచ్చి రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రాజధాని రైతులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అన్ని విధాల ఆదుకుంటారని మంత్రి హామీ ఇచ్చారు. వైఎస్సార్‌సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నేరాల సంఖ్య 6 శాతం తగ్గిందని అన్నారు. అన్ని ప్రాంతాలకూ న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే సీఎం జగన్‌ పాలన వికేంద్రీకరణ తీసుకొస్తున్నారని సుచరిత స్పష్టం చేశారు. ఇంకా రాజధాని భూముల కొనుగోలులో అక్రమాలు జరిగాయని, వాటిపై ఇప్పటికే ఈడీ దర్యాప్తు చేపట్టిందని హోంమంత్రి సుచరిత తెలిపారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/