కరోనా వైరస్పై ప్రధాని మోడి జాగ్రత్తలు
తరచుగా చేతులను శుభ్రంగా కడుక్కోవడం, బయటికి వెళ్లినప్పుడు ఇతర వ్యక్తులకు వీలైనంత ఎడంగా ఉండడం వంటి చర్యలను ప్రతి ఒక్కరూ పాటించాలి
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ (కొవిడ్-19) వ్యాప్తి నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈసందర్భంగా ప్రధాని మోడి స్పందించారు. కరోనా వైరస్ వల్ల భయపడాల్సిందేమీ లేదని పేర్కొన్నారు. సమష్టిగా కార్యాచరణకు ఉపక్రమించాల్సిన తరుణం ఇదేనని ట్వీట్ చేశారు. కరోనాను నివారించడానికి చిన్నవైనా, అత్యంత ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని పేర్కొన్నారు. తరచుగా చేతులను శుభ్రంగా కడుక్కోవడం, బయటికి వెళ్లినప్పుడు ఇతర వ్యక్తులకు వీలైనంత ఎడంగా ఉండడం వంటి చర్యలను ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు. పదేపదే కళ్లు నులుముకోవడం, ముక్కు, నోటి వద్ద చేతులు ఉంచుకోవడం చేయరాదని, దగ్గు వచ్చినప్పుడు చేతులు అడ్డంపెట్టుకుని దగ్గాలని, జ్వరం, దగ్గుతో బాధపడుతుంటే వైద్యచికిత్స తీసుకోవాలని సూచించారు. వైద్యనిపుణుల సలహాలను తప్పకుండా పాటించాలని మోడి తన ట్వీట్ లో స్పష్టం చేశారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/