కామారెడ్డి రోడ్డు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. మృతులకు రూ.2 లక్షల పరిహారం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ కామారెడ్డి రోడ్డు ప్రమాదం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తి చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతులకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. కాగా, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరిన విషయం తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/