పీఎం కిసాన్ నిధి అమౌంట్ రిలీజ్
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం చిన్న రైతులకు కిసాన్ సమ్మన్ నిధి కింద రెండు వేల ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఈరోజు 9వ ఇన్స్టాల్మెంట్ను ప్రధాని మోడీ రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా సుమారు రూ.19,500 కోట్ల మొత్తాన్ని రైతుల అకౌంట్లోకి క్రెడిట్ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కార్యక్రమంలో ప్రధాని ఈ అమౌంట్ను రిలీజ్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం 12.30 తర్వాత అమౌంట్ క్రెడిట్ అవుతోంది. సుమారు 9.75 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి నిధి వెళ్తుంది. ఆగస్టు-నవంబర్ పీరియడ్కు సంబంధించిన అమౌంట్ను రిలీజ్ చేశారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/