కేదార్నాథ్ ఆలయంలో ప్రధాని మోడి ప్రతేక్య పూజలు
డెహ్రాడూన్: ప్రధాని మోడీ ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మోడీ ఈరోజు ఉదయం కేదార్నాథ్లో ప్రతేక్య పూజలు నిర్వహించారు. బాబా కేదార్కు ఆయన హారతి ఇచ్చారు. ఉదయం 8.30 నిమిషాలకు ఆయన కేదార్నాథ్ చేరుకున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ప్రత్యేక వస్త్రధారణలో మోడీ ఆలయాన్ని విజిట్ చేశారు. హిమాచల్ ప్రదేశ్కు చెందిన చంబా మహిళలు చేతితో తయారు చేసిన సంప్రదాయ డ్రెస్సు చోలా దొరను ధరించిన ఆయన ఆలయ దర్శనం చేసుకున్నారు. కేదార్నాథ్లో ఉన్న ఆది గురువు శంకరాచార్య సమాధిని కూడా ఆయన సందర్శించారు. గౌరికుండ్ నుంచి కేదార్నాథ్ వరకు రోప్వే ప్రాజెక్టుకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఇవాళ సాయంత్రం బ్రదీనాథ్ కూడా మోడీ వెళ్లనున్నారు. అక్కడ కూడా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.