ఓటేసిన ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ మోడీ
గాంధీనగర్ః ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోడీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గాంధీనగర్లోని రేసాన్ ప్రైమరీ స్కూల్లో ఆమె ఓటు వేశారు. 99 ఏళ్లున్న హీరాబెన్ మోడీ.. వీల్ఛైర్లో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసి యువతకు స్ఫూర్తిగా నిలిచారు. ఆమెతో పాటుగా అహ్మదాబాద్లో ప్రధాని సోదరుడు సోమభాయ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక మోడీ అహ్మదాబాద్లోని రాణిప్ ప్రాంతంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు . కాలినడక పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆయన క్యూలైన్లో నిల్చుని ఓటేశారు.
కాగా, గుజరాత్ లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 19.17శాతం పోలింగ్ నమోదైనట్లుగా ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తం 14 రాష్ట్రాల పరిధిలోని 93 నియోజకవర్గాలకు నేడు ఓటింగ్ జరుగుతోంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/