దేశ భద్రతపై అత్యున్నత స్థాయి భేటీ
పలువురు కేంద్ర మంత్రులతో మోడీ సమావేశం
New Delhi: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం 18 రోజులుగా కొనసాగుతున్న ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. దేశ భద్రత, రష్యా – ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంపై ఈ సమావేశం లో చర్చించారు. రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/