దేశంలో బొగ్గు కొరత పై నేడు ప్రధాని మోడీ సమీక్ష!

న్యూఢిల్లీ : దేశంలో బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సంక్షోభం తలెత్తబోతుందంటూ పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. బొగ్గు సరఫరా పరిస్థితిపై విద్యుత్, బొగ్గు మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ప్రధాని సమావేశం కానున్నారని పీఎంఓ వర్గాలు తెలిపాయి. హోం మంత్రి అమిత్‌షా ఇప్పుటికే బొగ్గు, విద్యుత్ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సోమవారంనాడు సమీక్షా సమావేశం నిర్వహించారు. బొగ్గు నిల్వలు, విద్యుత్ డిమాండ్, సరఫరా వంటి అంశాలను సమీక్షించారు.

ఢిల్లీ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, బీహార్, తమిళనాడు, రాజస్థాన్, కేరళ వంటి రాష్ట్రాలు ఇ్పపటికే బొగ్గు కొరతపై ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే కేంద్రం అలాంటిదేమీ లేదని, పవర్ ప్లాంట్ల డిమాండ్‌కు తగినన్ని బొగ్గు నిల్వలు ఉన్నాయని చెబుతోంది. ఇవన్నీ అనవసర భయాందోళనలేనని, తగినంత విద్యుత్ అందుబాటులో ఉందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/