ఎగ్జిబిషన్లో ప్రధాని మోడి సందడి
ఆలుబోండా తిని చాయ్ తాగిన మోడి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఢిల్లీలో క్రాఫ్ట్స్ ఫెస్ట్ ‘హునార్ హాత్’ ఎగ్జిబిషన్లో సందడి చేశారు. కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే నేరుగా అక్కడికి వెళ్లిన ప్రధాని.. స్థానికులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఎగ్జిబిషన్లో హస్త కళల స్టాల్స్ని సందర్శించి వ్యాపారులతో మాట్లాడారు. అనంతరం లిట్టి చోకా తిని మట్టి కప్పులో చాయ్ తాగారు. ఢిల్లీ క్రాఫ్ట్స్ ఫెస్ట్లో లిట్టి చోకా తిని రూ.120 చెల్లించారు.
అనంతరం మోడి , ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కలిసి టీ తాగారు. మట్టి గ్లాసుల్లో ఛాయ్ తాగి రూ.40 చెల్లించారు. ఢిల్లీ క్రాఫ్ట్స్ ఫెస్ట్లో సుమారు 50 నిమిషాల పాటు మోడిఉన్నారు. అన్ని స్టాల్స్ తిరిగి అక్కడున్న వస్తువులను వీక్షించారు కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఈ హునార్ హాత్ కార్యక్రమం జరిగింది.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/