జానపద పాటలు, కథల్లోనూ దేశ చరిత్ర దాగి ఉంది..ప్రధాని
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఉత్తరప్రదేశ్లో మహారాజా సుహెల్దేవ్ మెమోరియల్కు, చిత్తౌరా లేక్ అభివృద్ధి పనులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రధాని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలకు వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వసంత పంచమి దేశంలో కొత్త ఆశలను చిగురింపజేయాలని, కొత్త ఉత్సాహాలను నింపాలని, కరోనా మహమ్మారి బాపతు ఆపదలను పూర్తిగా తొలగిపోవాలని ప్రధాని ఆకాంక్షించారు.
దేశ చరిత్ర అనేది దేశానికి బానిసత్వం నుంచి విముక్తి కల్పించిన వారి రచనల్లో, బానిస మస్తత్వం కలిగిన వారి మాటల్లో మాత్రమే లేదని, సాధారణ ప్రజల జానపద పాటలు, కథల్లోనూ దేశ చరిత్ర దాగి ఉన్నదని ప్రధాని మోడి చెప్పారు. జానపదాల ద్వారానే దేశ చరిత్ర తరతరాలకు అందించబడుతున్నదని ఆయన చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు కావస్తున్నా మహారాజా సుహెల్దేవ్ లాంటి యోధుల త్యాగాలను, పోరాట పటిమను, పరాక్రమాన్ని, అమరత్వాన్ని భావితరాలకు చాటిచెప్పే పెద్ద కార్యక్రమాలు ఏవి జరుగడం లేదన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/