విశాఖలోభారీ బహింరంగ సభలో ప్రధాని ప్రసంగం

సభాస్థలికి చేరుకున్న మోడీ.. శాలువాతో సత్కరించిన జగన్

YouTube video
PM Modi launches multiple development projects in Visakhapatnam, Andhra Pradesh

అమరావతిః ప్రధాని మోడీ విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్ కు చేరుకున్నారు. ఐఎన్ఎస్ చోళ గెస్ట్ హౌస్ నుంచి హెలికాప్టర్ లో ఆయన సభాస్థలికి విచ్చేశారు. ఆయనతో పాటు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా మోడీకి కీలక నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రధానికి జగన్ శాలువా కప్పి సత్కరించారు. శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని బహూకరించారు.

అనంతరం సభాస్థలి వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రధాని వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే పూర్తయిన పనులను జాతికి అంకితం చేయనున్నారు. భారీ బహింరంగ సభలో ఆయన ప్రసంగిస్తున్నారు. అనంతరం విశాఖ నుంచి హైదరాబాద్ కు బయల్దేరుతారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/