ఫ్రంట్లైన్ వర్కర్ల కోసం క్రాష్ కోర్సు ప్రారంభం
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ స్కిల్ ఇండియాలో భాగంగా కోవిడ్19 ఫ్రంట్లైన్ వర్కర్ల కోసం క్రాష్ కోర్సు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. దేశవ్యాప్తంగా సుమారు లక్ష మంది ఫ్రంట్లైన్ వర్కర్లను తయారు చేయాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని ప్రధాని మోడీ అన్నారు. 45 ఏళ్లు దాటిన వారికి ఎలా ప్రాధాన్యత ఇస్తున్నారో.. జూన్ 21వ తేదీ నుంచి 45 ఏళ్ల లోపు వారికి కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియలో అదే రీతిలో గుర్తింపు ఉంటుందన్నారు.
కోవిడ్19 క్రాష్ కోర్సు మూడు నెలల పాటు ఉంటుందని, శిక్షణ పొందిన వారు కోవిడ్ పోరాటంలో అందుబాటులో ఉంటారని ప్రధాని అన్నారు. నర్సింగ్, హోమ్కేర్, క్రిటికల్ కేర్, శ్యాంపిల్ కలెక్షన్, మెడికల్ టెక్నీషియన్ లాంటి అంశాలపై క్రాష్ కోర్సులో ఫోకస్ చేస్తారని ప్రధాని వెల్లడించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/