ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన లబ్ధిదారులతో ప్రధాని
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) లబ్ధిదారులతో ప్రధాని మోడీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ఉచిత రేషన్ లక్షలాది కుటుంబాలకు ఆసరాగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కరోనా మహమ్మారి ప్రభావంతో ఇబ్బందులు పడిన ప్రజలకు అన్ని విదాలుగా సాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. పీఎంజీకేఏవై పధకం పెద్దసంఖ్యలో ప్రజలకు ఉపయోగపడాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోందని చెప్పారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/