కొత్త పార్లమెంట్ భవనంపై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన ప్రధాని
న్యూఢిల్లీః ప్రధాని నరేంద్ర మోడీ నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనం పైఅంతస్థుపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించారు. కాంస్యంతో రూపొందించిన ఈ చిహ్నం మొత్తం బరువు 9,500 కేజీలు కాగా, పొడవు ఆరున్నర మీటర్లు. ఈ కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, హర్దీప్ సింగ్ పురి ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంటు భవన నిర్మాణంలో పాలుపంచుకుంటున్న ఇంజనీర్లు, ఉద్యోగులతో ప్రధాని సంభాషించారు. కాగా ,2020 డిసెంబర్ 10న ప్రధాని మోడీ పార్లమెంట్ నూతన భవనానికి శంకుస్థాపన చేశారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/