‘ఆరోగ్య వన్’ ను ప్రారంభించిన ప్రధాని
గుజరాత్ లో పర్యటిస్తున్న ప్రధాని మోడి
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్రమోడి గుజరాత్ పర్యటనలో భాగంగా పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే ఈ ఉదయం నర్మదా జిల్లాలోని కెవాడియాలో ‘ఆరోగ్య వన్’ ఔషధ మొక్కల పార్కును ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం ఆ ఉద్యానవనంలో కలియదిరిగారు. ‘ఆరోగ్య వన్’ పార్కులో వందల సంఖ్యలో ఔషధ మొక్కలు, మూలికలు ఉన్నాయి. ఈ మొక్కలు, మూలికల గురించిన పూర్తి సమాచారాన్ని కూడా పార్కులో అందుబాటులో ఉంచారు. కాగా పార్కులో పర్యటించిన సందర్భంగా ప్రధాని మోడి వెంట గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి విజయ్ రూపాని ఉన్నారు. పార్కు విశేషాలను వారు మోడికి వివరించారు. కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చిలో లాక్ డౌన్ విధించాక మోడి గుజరాత్ రావడం ఇదే ప్రథమం. మోడి తన పర్యటన సందర్భంగా నిన్న మరణించిన గుజరాత్ మాజీ సీఎం కేశూభాయ్ పటేల్ కు నివాళులు అర్పించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/