అఖిలపక్ష సమావేశానికి మోడి పిలుపు

భారత్-‌చైనా ఉద్రిక్తతలపై..దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులతో మాట్లాడనున్న మోడి

PM Modi
PM Modi

న్యూఢిల్లీ: భారత్-‌చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులుపై ప్రధాని మోడి అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులతో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడనున్నారు. కాగా, గాల్వన్‌లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇరు దేశాలు పెద్ద సంఖ్యలో తమ సైన్యాన్ని సరిహద్దుల వద్దకు తరలిస్తున్నాయి. కాగా ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర మంత్రులు, ఆర్మీ అధికారులతో ప్రధాన మంత్రి నరేంద్రమోడి చర్చించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/