మహిళలు సాధించిన విజయాలతో దేశం గర్విస్తున్నది

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళంందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సాధించిన విజయాలతో దేశం గర్విస్తున్నదని అన్నారు. మహిళా సాధికారత సాధనకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించడమే తమ లక్ష్యమని తెలిపారు. ‘మన దేశానికి చెందిన మహిళలు సాధించిన అనేక విజయాలతో భారత్‌ గర్విస్తున్నది. మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తూ సాధికారత సాధించేలా మా ప్రభుత్వం కృషి చేస్తున్నది’ అని ట్వీట్‌ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/