కెనడాలో ఇన్వెస్ట్‌ ఇండియా సదస్సులో ప్రధాని కీలక ప్రసంగం

PM Modi
PM Modi

న్యూఢిల్లీ: ఈరోజు సాయంత్రం కెనడాలో జ‌రుగ‌నున్న ఇన్వెస్ట్ ఇండియా స‌ద‌స్సులో ప్రధాని నరేంద్రమోడి కీల‌క ప్ర‌సంగం చేయ‌నున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడి ఢిల్లీ నుంచే వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్ర‌సంగించ‌నున్నారు. దేశంలో పెట్టుబ‌డులు పెట్టే విష‌యంలో కెన‌డా వ్యాపార వ‌ర్గాల‌కు ప్ర‌థ‌మ ప్రాధాన్యం ఇవ్వ‌డ‌మే ముఖ్య ఉద్దేశంగా ఇన్వెస్ట్ ఇండియా పేరుతో ఈ స‌ద‌స్సు నిర్వ‌హిస్తున్నార‌ని ప్ర‌ధాని కార్యాల‌యం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. భార‌త్‌లో పెట్టుబ‌డి అవ‌కాశాలు, ఇక్క‌డ పెట్టుబ‌డుల‌వ‌ల్ల ఇన్వెస్ట‌ర్ల‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు త‌దిత‌ర అంశాల‌పై ప్ర‌ధాని ప్ర‌సంగించ‌నున్నార‌ని పీఎంవో వెల్ల‌డించింది.


తాజా అంతార్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/