న్యూజిలాండ్ ప్రధానికి మోడి అభినందనలు

న్యూఢిల్లీ: న్యూజిలాండ్ ప్రధానిగా జసిండా అర్డెర్న్ రెండోసారి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని జెసిండా ఆర్డెర్న్కు అభినందనలు తెలుపుతూ..ప్రధాని నరేంద్రమోడి ట్వీట్ చేశారు. ‘ఏడాది క్రితం జరిగిన మా చివరి సమావేశాన్ని గుర్తుచేసుకుని, భారత్న్యూజిలాండ్ బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి కలిసి కృషి చేస్తాం’ అని ప్రధాని మోడి తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/