తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, జగన్
సమాజంలో శాంతి, సామరస్యాలు పెంపొందాలి.. మోడీ
అల్లా దయతో అంతా మంచి జరగాలి.. జగన్
న్యూఢిల్లీ: నేటి నుండి రంజాన్ మాసం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ముస్లింలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఏపీ సీఎం జగన్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం పేదలకు సేవ చేసేలా ప్రజల్లో స్ఫూర్తిని కలిగించాలని కోరుకుంటున్నట్లు మోడీ చెప్పారు. సమాజంలో శాంతి, సామరస్యాలు, కరుణ పెంపొందాలని మోడీ అన్నారు.
”రంజాన్ నెల ప్రారంభమవుతున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు. నెల రోజులపాటు అత్యంత నియమనిష్టలతో ఉపవాస దీక్షలు ఆచరించబోతున్ ప్రతి ఒక్కరికీ అల్లా దయతో అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. కాగా, రంజాన్ నెల ప్రారంభమైన నేపథ్యంలో ముస్లింలు ఉపవాస దీక్షలు ప్రారంభించారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/