కేంద్రమంత్రి డ్యాన్స్ కు ప్ర‌ధాని మోడీ కామెంట్

న్యూఢిల్లీ : అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ టూర్‌లో ఉన్న కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు డ్యాన్స్ చేశారు. స్థానిక గ్రామ‌స్థుల‌తో క‌లిసి ఆయ‌న సాంప్ర‌దాయ స్టెప్పులేశారు. ఆ వీడియోను ఆయ‌న కూ సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. క‌జలాంగ్ గ్రామానికి చెందిన సాజోలాంగ్ తెగ ప్ర‌జ‌ల‌తో క‌లిసి మంత్రి రిజిజు డ్యాన్స్ చేశారు. సాజోలాంగ్ తెగ ప్ర‌జ‌ల్ని మిజీల‌ని కూడా అంటారు. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో తెగ‌లు ఇలా సాంప్ర‌దాయ నృత్యాల‌ను ఎంజాయ్ చేస్తుంటార‌ని, వారితో క‌లిసి డ్యాన్స్ చేసిన‌ట్లు రిజిజు తెలిపారు.

అయితే రిజిజు డ్యాన్స్‌పై ప్ర‌ధాని మోడీ కామెంట్ చేశారు. మా న్యాయ‌శాఖ మంత్రి రిజిజు మంచి డ్యాన్స‌ర్ అంటూ త‌న ట్విట్ట‌ర్‌లో మోడీ ఓ పోస్టు చేశారు. వైభ‌వ‌మైన‌ అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ సంస్కృతిని చూడ‌డం సంతోషంగా ఉంద‌ని మోడీ అన్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/