బైడెన్తో ప్రధాని మోడీ భేటీ డేట్ ఫిక్స్
రేపే ప్రధాని మోడీ అమెరికా పర్యటన
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోడీ రేపు (బుధవారం) అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్తో భేటీ అవుతారు. నేతలిద్దరూ ఈ నెల 24న వైట్హౌస్లో సమావేశం అవుతారని అధ్యక్ష భవనం నిన్న వెల్లడించింది. ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు చర్చించనున్నారు. అలాగే, ఆఫ్ఘనిస్థాన్లోని ప్రస్తుత పరిస్థితులు, కొవిడ్ వ్యాక్సినేషన్ తదితర అంశాలపైనా చర్చించే అవకాశం ఉంది. కాగా, అదే రోజు అమెరికాలో జరగనున్న క్వాడ్ కూటమి సదస్సులో మోడీ, బైడెన్, జపాన్, ఆస్ట్రేలియా ప్రధానులు సుగా యోషిహిడే, స్కాట్ మోరిసన్ పాల్గొంటారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/