మనం గురువుల్ని గుర్తుచేసుకోవాలి..మోడి

YouTube video
PM Modi addresses celebration of Dharma Chakra Day via VC

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఆషాఢ పూర్ణిమ (గురు పూర్ణిమ, గురు పౌర్ణమి) సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో… ఈ శుభ సందర్భంగా… మనం గురువుల్ని గుర్తుచేసుకోవాలని ప్రధాని అన్నారు. గురువులు మనకు జ్ఞానం ఇచ్చారని వారిని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రపంచ మానవాళికి శాంతి మార్గాన్ని బోధించిన బుద్ధ భగవానుడిని మోడి స్మరించుకున్నారు. నివాళులు అర్పించారు. తధాగతుడు సూచించిన 8 సూత్రాల మార్గం… ఎన్నో దేశాలు, సమాజాల అభివృద్ధికి బాటలు పరిచిందని మోడి గుర్తుచేశారు. దయ, జాలి గొప్పదనం తెలిసొచ్చిందన్నారు. ఆలోచించడానికీ, పాటించడానికీ బుద్ధుడి విధానాలు ఎంతో అనుకూలంగా ఉంటాయన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/