నేడు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ డబ్బుల జమ

రైతుల తీపి కబురు అందించింది కేంద్రం. ఈరోజు పీఎం కిసాన్ సమ్మాన్ యోజనకు సంబంధించిన డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు. దేశంలోని రైతులంతా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన 12వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయబోతున్నారు.

8.5 కోట్ల మందికిపైగా ఈ స్కీమ్ కింద లాభాలను పొందుతున్నారు. ఇది ఇలా ఉంటే 2019 జూన్ నుంచి పథకాన్ని రైతులు అందరికీ అందుబాటులో ఉంచారు. ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు తొలి విడత డబ్బులు వచ్చాయి. ఈ స్కీమ్ కింద చేరాలంటే ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్, మొబైల్ నెంబర్, పేరు, కేటగిరి, జెండర్ వివరాలు అవసరం అవుతాయి. అలానే స్టేటస్ ని తెలుసుకోవాలంటే రైతులు155261 నంబర్‌కు డైల్ చేసి స్టేటస్ ని తెలుసుకోవచ్చు.