శంషాబాద్ విమానాశ్రయం ప్లంబింగ్ పనుల్లో అపశ్రుతి
యాసిడ్ పొగ పీల్చి కూలీ మృతి
Hyderabad: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్లంబింగ్ పనులు చేస్తున్న ముగ్గురు కూలీలు అస్వస్థతకు గురయ్యారు. పైప్ నుంచి ఘాటైన యాసిడ్ పొగను పీల్చటంతో ఈ సంఘటన జరిగింది. బాధితులు నర్సింహారెడ్డి, జాకీర్, ఇలియాస్లను వెంటనే ఎయిర్ పోర్ట్లోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నర్సింహారెడ్డి(42) మృతి చెందాడు. .మిగిలిన ఇద్దరు చికిత్స పొందుతున్నారు.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/