ఏపిలో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా
అమరావతి: ఏపిలో ఈనెల 8వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈకార్యక్రమాన్ని అధికారులు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఇళ్ల పట్టాల పంపిణి చేసే రోజును నేడు ప్రభుత్వం ప్రకటించనుంది. కాగా ఆగస్టు 15న ఈ కార్యక్రమం నిర్వహించే అవకాశమున్నట్లు సమాచారం. వైఎస్ఆర్ జయంతి రోజు ఇళపట్టాలు ఇవ్వాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/