తిరుమ‌ల కొండ‌పై ప్లాస్టిక్ నిషేధం..రేపటి నుండి అమలు

తిరుమల భక్తులకు టీటీడీ ముఖ్య ప్రకటన తెలియజేసింది. రేపటి నుండి తిరుమల కొండపై ప్లాస్టిక్ ను నిషేదిస్తున్నట్లు తెలిపింది. తిరుమ‌ల కొండ‌పై ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్న ప్ర‌క‌టించిన టీటీడీ…కొండ‌పైకి ఎలాంటి ప్లాస్టిక్ వ‌స్తువుల‌ను అనుమతించ‌ని విధంగా నిఘా పెట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ఇందుకోసం అలిపిరి టోల్ గేట్ వ‌ద్ద ప్లాస్టిక్‌ను గుర్తించే సెన్సార్ల‌తో నిఘా పెంచ‌నున్న‌ట్లు తెలిపింది. అంతేకాకుండా కొండ మీద వ్యాపారం చేస్తున్న వారు కూడా ప్లాస్టిక్‌కు ప్ర‌త్యామ్నాయాల‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించింది. ప్లాస్టిక్ రహిత వస్తువుల్ని మాత్రమే అనుమతిస్తామన్నారు. జూన్ 1 నుంచి తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం విధిస్తున్నామని.. దుకాణదారులు, హోటళ్ల ప్లాస్టిక్ కవర్స్ వాడితే సీజ్ చేస్తామన్నారు. షాంపులు కూడా తిరుమలలో నిషేదించారు. అలాగే తిరుమలలో దుకాణదారులు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఈ మార్పును గమనించి భక్తులు, దుకాణదారులు తమకు సహకరించాలని టీటీడీ కోరింది.