జగన్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం
కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ
అమరావతి: ఏపిలో కరోనా వ్యాప్తి అధికమవుతుండడంతో మంత్రులతో సిఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆళ్లనాని, బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ. డిజిపి ఈ సమావేశానికి హజరయ్యారు. రాష్ట్రంలో కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తుంది. కాగా ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 502 కు చేరుకుంది. దీని కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 11 మంది మృతి చెందారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/