ఐదో రోజు పెరిగిన పెట్రోల్ ధర
న్యూఢిల్లీ: దేశంలో వరుసగా ఐదో రోజు పెట్రోల్ ధరను పెంచతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గురువారం లీటరు పెట్రోల్పై 10 పైసలు పెంచాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.81కి చేరింది. హైదరాబాద్లో లీటర్కు రూ.84.18, కొల్కతాలో రూ.82.53, ముంబైలో రూ.87.68, చెన్నైలో రూ.84.09, బెంగళూరులో రూ.83.63, భువనేశ్వర్లో రూ.81.54, జైపూర్లో రూ.88.21, పాట్నాలో 83.68, త్రివేండం రూ.82.66కి చేరింది. గత ఐదు రోజుల్లో పెట్రోల్పై చమురు కంపెనీలు రూ.50పైసలకుపైగా పెంచాయి. కాగా, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో లీటర్కు రూ.73.56 ఉండగా, హైదరాబాద్లో లీటర్కు రూ.80.17గా ఉంది. నిత్యం ధరలపై చమురు సంస్థలు సమీక్ష జరుపుతుండగా రేట్లు పెరుగుతూ వస్తున్నాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/