దేశవ్యాప్తంగా తగ్గిన పెట్రోల్ ధరలు!
న్యూఢిల్లీ: పెట్రోల్ ధరలు నేడు దేశవ్యాప్తంగా తగ్గుముఖం పట్టాయి. రష్కా, సౌదీ అరేబియా ల మధ్య నెలకొన్న చమురు యుద్ధం నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గిన విషయం తెలిసిందే. దీంతో భారతదేశంలో పెట్రోలు, డీజిల్ వినియోగదారులకు స్వల్ప ఊరట లభించింది. వివిధ నగరాల్లో పెట్రోల్ పై 24 నుంచి 27 పైసలు, డీజిల్ పై 25 నుంచి 26 పైసల మేర ధర తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు తెలిపాయి. దీంతో ఎనిమిది నెలల కనిష్ఠానికి పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గాయి.
ఇక ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 70.59కి చేరుకోగా, డీజిల్ ధర లీటర్ రూ. 63.26కి దిగివచ్చింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 75.04గా, డీజిల్ లీటర్ ధర రూ. 68.88 వద్ద కొనసాగుతోంది. ఈ ధరలు సమీప భవిష్యత్తులో మరింతగా తగ్గుతాయని చమురు రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/