12వ రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోలుపై లీటరుకు నేడు 53 పైసల పెంపు..డీజిల్పై లీటరుకు 64 పైసలుపెంపు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. దేశంలో వరుసగా 12వ రోజు కూడా పెట్రోల్ డీజిల్ ధరల్ని పెంచాయి. పెట్రోలుపై లీటరుకు 53 పైసలు, డీజిల్పై లీటరుకు 64 పైసలు పెరిగాయి. 12 రోజుల్లో పెట్రోలు ధర లీటరుకి రూ.6.55, డీజిల్ ధర రూ.7.04 పెరగడం గమనార్హం. ధరల పెరుగుదల అనంతరం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.77.81కి, డీజిల్ ధర రూ.76.43కి చేరింది. ముంబైలో పెట్రోలు లీటరుకి రూ.84.66కి, డీజిల్ 74.93కి చేరింది. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.81.32, డీజిల్ ధర రూ.74.23గా ఉంది. కోల్కతాలో లీటరు పెట్రోలు రూ.79.59, డీజిల్ ధర రూ.71.96గా ఉంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/