దేశంలో కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు

న్యూఢిల్లీ: దేశంలో పెట్రో మంట కొనసాగుతోంది. పెట్రోల్ , డీజిల్ పై నేడు ధరలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. సోమ‌వారం లీటరు పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసలు పెరిగింది. పెట్రోల్‌ ధరలు పెరగడం గడిచిన ఏడు రోజుల్లో ఇది ఆరో సారి. వారం రోజుల్లోనే లీట‌ర్‌కు రూ. 4 వ‌ర‌కు చ‌మురు సంస్థ‌లు పెంచాయి. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 112.71, డీజిల్ లీట‌ర్ రూ. 99.07గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ. 114.19, డీజిల్ లీట‌ర్ రూ. 98.50, కోల్‌క‌తాలో పెట్రోల్ రూ. 108.85, డీజిల్ రూ. 93.92, చెన్నైలో పెట్రోల్ రూ. 105.18, డీజిల్ రూ. 95.33గా ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/