సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా పేర్ని నాని
ఆంధ్రప్రదేశ్ రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న పేర్ని వెంకట్రామయ్యకు (నాని) మరో బాధ్యత అప్పగించింది రాష్ట్ర సర్కార్. మంత్రి పేర్ని నానికి సినిమాటోగ్రఫీ శాఖ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. ఈమేరకు బుధవారం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ఉత్తర్వులు జిఓఎంఎస్ సంఖ్య 144 ద్వారా రాజపత్రం(గెజిట్ నోటిఫికేషన్) జారీచేశారు.
ఇక ప్రస్తుతం ఏపీలో సినిమా టికెట్ ధరల విషయంలో గందరగోళం నెలకొని ఉంది. టికెట్ల ధరలు పెంచడం కుదరదని ఇటీవల ఏపీ ప్రభుత్వం జీవో 35ను ప్రవేశపెట్టింది. పెద్ద, చిన్నా అని తేడా లేకుండా అన్ని సినిమాలకు ఒకే టికెట్ ధరలు వర్తిస్తాయని జీవోలో పేర్కొంది. అయితే ఏపీ ప్రభుత్వ జీవోను సవాల్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టుల ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవోను రద్దు చేస్తూ.. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు టికెట్లపై నిర్ణయాలు తీసుకోవచ్చని తెలిపింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తే ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది.