పరిపూర్ణత
అధ్యాత్మిక చింతన
ఆలోచనలు లేకుండా మనసు ఉండదు. మనసు పరిపూర్ణత సంతరించుకోవాంటే ఆలోచనల్లో ఊగిసలాట ఉండరాదు. స్థిరత్వం ఉండాలి. పరిపక్వత ఉండాలి.
సజావైన ఆలోచనలున్న మనసు శరీరాన్ని తన స్వాధీనంలో ఉంచుకోగలుగుతుంది.
కించిత్తు అనారోగ్యాన్ని తొంగిచూడనివ్వదు. కేవలం తనలోని పరిపూర్ణతనే కాదు, శరీరంలోని ప్రతి అవయవంలోని పరిపూర్ణతని శాసించగల శక్తి ఆ మనసుకు ఉంటుంది.
అందుకే ఆరోగ్యమైన మనసున్న వ్యక్తి శారీరకంగానూ పూర్ణారోగ్యంతో ఉన్నానని పదే పదే తనకు తాను చెప్పుకొంటాడు.
తప్పి జారి ఆలోచనలో అస్థిరత ప్రవేశిస్తే చాలు అది నసును కలచి వేయటమే కాదు, శరీరంలో ఏదో ఒక బలహీనమైన చోట వెనువెంటనే రోగలక్షణానికి అంకురారోపణ చేస్తుంది.
అపరిపక్వమైన ఆలోచనలే అన్ని రోగాలకి మూలకారణం.
అందులో వ్యతిరేకమైన ఆలోచనలు మనసులో ప్రవేశించాలే గాని రోగతీవ్రత పెరిగిపోవడానికికది ఆస్కారమవ్ఞతుంది.
అంటే ఒక విధంగా చేచేతులా మన అనారోగ్యాన్ని మనమే తెచ్చుకున్న వాళ్లమవ్ఞతాం. అప్పుడు మనసు కూడదీసుకోవాలి.
అటుఇటు పరుగెత్తే ఆలోచనల్ని కట్టడి చేయాలి. ఇదేమిటి? ఒక్కసారిగా నా మీద నాకు పట్టు ఎలా తప్పిపోయింది? నేను పరిపూర్ణుడినే అలా ఎలా నా సామర్ధ్యాన్ని చేజార్చుకున్నాను?
నేను నేనుగానే ఉండాలి. మళ్లీ మామూలు మనిషినైపోవాలి? అని మనసును సమాధానపరచుకోవాలి.
ఇది చాలా వరకు ధ్యానసాధనతో సానుకూలమవ్ఞతుంది. ఎవరికి వారు మనోధైర్యంతో యధాస్థితికి రావాల్సిందే కానీ ఇంకొకరు చేయగలిగేదేమీ ఉండదు.
ఒక్కొక్కప్పుడు వాతావరణ కాలుష్యం వల్ల మార్పు వల్ల వయోభారం వల్ల అనుకున్నంత త్వరగా శరీరారోగ్యం చక్కబడకపోవచ్చు.
అటువంటప్పుడు రోగిని పలకరించి సానుభూతి చూపించే బంధుమిత్రులు సర్వసాధారణంగా ఒక తప్పు చేస్తుంటారు.
ఆ రోగి అస్వస్థత గురించి మరింత లోతుగా కూపీ తీస్తారు. చర్చిస్తారు. పదే పదే అడిగిన దాన్నే అడుతుంటారు.
ఒక్కోసారి ఇలాకాక మరోలా వైద్యం చేయాల్సిందని ఉచిత సలహాలిస్తుంటారు. ఇతరుల రోగ లక్షణాలతో పోల్చి మరింతగా భయడపెడుతుంటారు.
దీని వల్ల ఆ రోగికి సాంత్వన కలగకపోగా మరింత అపకారం జరుగుతుంది. అతనికి న్న సహజమైన మానసిక శక్తి హరించి పోతుంది.
తానింక ఎప్పటికీ ఆరోగ్యం పుంచుకోలేనేమో అన్న అధైర్యం కుంగదీస్తుంది. అందుకనే వివేకవంతులు రోగి అనారోగ్యం గురించి ముక్తసరిగా మూడు ముక్కలు మాట్లాడి విషయాన్ని మరోవైపు మళ్లించాలి.
త్వరలోనే అంతా సవ్యంగా అయి పోతుందని రోగికి అనిపించేలా ధైర్యం చెప్పాలి. ఇంకెవరెవరో ఎంత త్వరగా కోలుకుని పూర్ణారోగ్యవంతులైనారో సోదాహరణగా చెఆప్పలి.
అసలా రోగమంత చిన్న విషయం ప్రపంచంలో మరొకటి లేదన్నంతగా తేలిగ్గా మాట్లాడాలి.
అసలు ప్రస్తావనే మార్చి ఆ రోగిని మరిపించాలి. సరదా సంగతులతో మురిపించాలి. పరిపక్వత కలిగిన వ్యక్తులు తమ పూర్ణారోగ్యాన్ని కాపాడుకోవమే కాదు.
ఇంతరుల అనారోగ్యాన్ని దూరం చేయగలుగుతారు. దానికి మానసిక దృఢత్వం, చక్కని ఆలోచనా సరళి క్రమశిక్షణతో కూడిన జీవితం ఎంతో అవసరం. వాళ్లే పరిపూర్ణులు.
-ఉలాపు బాలకేశవులు
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/