కరోనా కట్టడి కి ప్రజలు సహకరించాలి

సీిపీి అంజనీకుమార్‌

hyderabad cp anjani kimar
hyderabad cp anjani kimar

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో, కరోనాను కట్టడి చేసేందుకు ప్రజలందరూ సహకరించాలని సిపి అంజనీకుమార్‌ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదు అవుతున్నాయి. ఈ తరుణంలో ప్రజలు అనవసరంగా బయటకు రావద్దు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించవద్దని అన్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. పోలీసులు, వైద్యులు నిద్రలేని రాత్రులు గడుపుతు శ్రమిస్తున్నారని, ఇదంతా ప్రజల బాగు కోసమే అని సిపి అంజనీ కుమార్‌ పేర్కోన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/